Home తెలంగాణ “కేజ్ కల్చర్” బాధితులకు పరిహారానికి కృషి

“కేజ్ కల్చర్” బాధితులకు పరిహారానికి కృషి

493
0
Efforts to redress victims of
Victims of cage culture submitting petition to Minister Harish Rao

-ఆర్థిక, ఆరోగ్య శాఖా మాత్యులు హ‌రీష్‌రావు

(ప్ర‌జాల‌క్ష్యం ప్ర‌తినిధి)
హైద‌రాబాద్‌, ఆగ‌ష్టు 2ః ఎల్లంపల్లి నీటిపారుదల ప్రాజెక్టులో ఔత్సాహిక మత్స్యకారులు ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్న “కేజ్ కల్చర్” యూనిట్లు గోదావరి నదికి సంభవించిన ఇటీవలి భారీ వరదల్లో కొట్టుకు పోవడంతో జరిగిన నష్టానికి ప్రభుత్వం నుండి తగిన రీతిలో నష్టపరిహారం చెల్లించేందుకు కృషి చేస్తాననిరాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ మేరకు బాధితుల తరఫున తెలంగాణ ఫిషరీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు పిట్టల రవీందర్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయ కులు ముల్కలపల్లి వెంకటేశ్వర్లు, కేజ్ కల్చర్ నిర్వాహకుడు పిట్టల తిరుపతి తదితరులు ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ ను మంగళవారం మధ్యాహ్నం వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు బాధితులతో మాట్లాడుతూ రిజర్వాయర్లలో అధునాతన పద్ధతుల్లో నిర్వహిస్తున్న “కేజ్ కల్చర్” లాంటి ఆధునిక ప్రయోగాలకు ప్రమాదభీమా సౌకర్యం వర్తించే పోవడం శోచనీయని, సంబంధిత అధికారులతో చర్చించి భీమా సదుపాయాన్ని కల్పించేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తానని తెలిపారు. భారీవర్షాల వల్ల గోదావరినదికి అనూహ్యంగా పోటెత్తిన వరదలకారణంగా ఎల్లంపల్లి రిజర్వాయర్ లో ఔత్సాహిక మత్స్యకారులు ఏర్పాటు చేసుకుని నిర్వహిస్తున్న మొత్తం కేజ్ కల్చర్ యూనిట్లు అందులో పెంచుతున్న చేపలతోపాటు, మోటారు బోట్లు, నిలువ చేసుకున్న చేపల దాణా, ఇతర సామాగ్రి పూర్తిగా కొట్టుకుపోయి. నిర్వాహకులకు అపారమైన నష్టం సంభవించడం బాధాకరమని ఆయన అన్నారు. ఈ కేజ్ కల్చర్ నిర్వాహకులకు ప్రకృతి వైపరిత్యాలకు చెల్లించే నష్టపరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని, అట్లా వీలుకాని పక్షంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి తగిన పరిహారాన్ని ఇప్పించేందుకు ముఖ్యమంత్రిని సంప్రదించి కృషిచేస్తానని మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. భవిష్యత్తులో ఇట్లాంటి ప్రకృతి వైపరిత్యాలు సంభవించిన సందర్భాల్లో జలాశయాల్లో అధునాతన పద్ధతుల్లో చేపలపెంపకానికి సంబంధించి ఎలాంటి నష్టాలు సంభవించకుండా అవసరమైన చర్యలు తీసుకునేందుకు తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకునే విధంగా మత్స్యశాఖ పక్షాన తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.

Efforts to redress victims of "cage culture".
Victims of cage culture submitting petition to Planning Board Vice Chairman B.Vinod Kumar

ఎల్లంపల్లి రిజర్వాయర్ లో ప్రభుత్వ సహకారంతో ప్రయోగాత్మకంగా మూడు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన మొత్తం ఎనిమిది కేజ్ కల్చర్ యూనిట్లు జూన్ 13వ తేదీన గోదావరి నదికి అనూహ్యంగా పోటెత్తిన భారీ వరదల్లో పూర్తిగా కొట్టుకుపోయాయని, కేజ్ కల్చర్ యూనిట్లతో పాటుగా సుమారు కోటి రూపాయలు విలువ చేసే దాదాపు వంద టన్నుల చేపలు, నాలుగు మోటారు బోట్లు, సుమారు పది టన్నుల నిలువ చేసిన దాణా, ఫ్లోటింగ్ హౌజ్ (నీటిపై తేలియాడే ఇల్లు), తదితర విలువైన సామాగ్రి పూర్తిగా ఈ వరదల్లో కేజ్ కల్చర్ యూనిట్లు తోపాటు కొట్టుకుపోయి అపార నష్టం జరిగిందని బాధితులు తమ వినతి పత్రంలో వివరించారు.

ప్రభుత్వం అందించిన సహకారంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ కేజ్ కల్చర్ యూనిట్లు వరదల్లో కొట్టుకుపోవడంతో స్థానిక మత్స్యకార కుటుంబాలకు చెందిన అనేకమంది యువకులు తమ ఉపాధిని కోల్పోతున్నారని బాధితులు ప్రభుత్వానికి సమర్పించిన వినతిపత్రంలో తెలిపారు. ఎల్లంపల్లి రిజర్వాయర్ లో ఏర్పాటు చేసిన మొత్తం ఎనిమిది కేజ్ కల్చర్ యూనిట్లకు సంబంధించిన ఎనభై పంజరాలు ఈ వరదల్లో కొట్టుకుపోవడంతో మొత్తం నాలుగు కోట్ల రూపాయల భారీ నష్టం కలిగిందని బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఆధునిక పరిజ్ఞానంతో ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్న కేజ్ కల్చర్ యూనిట్లు ప్రకృతి వైపరీత్యం కారణంగా భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి రావడం వల్ల భవిష్యత్తులో ఇట్లాంటి యూనిట్లను ఏర్పాటు చేయాలనుకునే ఔత్సాహిక మత్స్యకారులకు ఆశనిపాతంలా మారిందని వారు తెలిపారు. అనూహ్యమైన రీతిలో గోదావరినది కి సంబంధించిన భారీ వరదల కారణంగా తమకు ఎదురైనా భారీ నష్టాలను ఉండి తమను గట్టెక్కించే డానికి ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

ఎల్లంపల్లి రిజర్వాయర్ లో తాము ఈ కేజ్ కల్చర్ యూనిట్లను నాలుగు సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేసినప్పటికీ, జలాశయంలో ఎదురైనా ప్రతికూల పరిస్థితుల కారణంగా కేవలం రెండు దఫాలుగా మాత్రమే తాము పాక్షికంగా చేపలు ఉత్పత్తిని సాధించగలిగామని, ఈసారి మాత్రమే పూర్తిస్థాయిలో చేపలను ఉత్పత్తి చేయగలిగామని, మరో నెలరోజుల్లో తమ యూనిట్లలో పౌష్టికంగా పెరిగిన చేపలను మార్కెట్ లో అమ్ముకోవడం ద్వారా గడచిన రెండు దశల్లో ఎదురైన నష్టాలను కొంతమేరకైనా పూడ్చుకోగలమనే ఆశలతో ఎదురుచూస్తున్న తరుణంలో “మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు”గా, గోదావరి వరదలు తమ అంశాలన్నింటినీ అడియాశలు చేస్తూ ముంచి వేసాయని కేజ్ కల్చర్ నిర్వా హకులు తమ ఆవేదనను వ్యక్తం చేసారు. ఈ కేజ్ కల్చర్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి తాము చేసిన అప్పులు కూడా ఇంకా తీరలేదని వారు వాపోయారు. ఆధునిక పద్ధతుల్లో చేపలను పెంచే ప్రక్రియను ఎంతో సాహసంతో ప్రయోగాత్మకంగా చేపట్టిన తమను ఆదుకోవడం ద్వారా భవిష్యత్తులో తమ లాగా ఆధునిక చేపలు పెంపకానికి ముందుకువచ్చే ఔత్సాహిక మత్స్యకారుల్లో విశ్వాసాన్ని కలిగించాలని బాధితులు ప్రభుత్వానికి ఈ వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here