Home తెలంగాణ రైతు బంధు చెక్కుల దుర్వినియోగం – 23 మంది అరెస్ట్

రైతు బంధు చెక్కుల దుర్వినియోగం – 23 మంది అరెస్ట్

282
0
Rythu Bandhu cheque fraud

– బ్యాంకు అధికారులు, రెవిన్యూ, దళారులు కుమ్మక్కు
– రూ. 61,50,460 రూపాయల దుర్వినియోగం
– 5 పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు

(ప్రజాలక్ష్యం  ప్రతినిధి)
నల్లగొండ, ఆక్టోబరు 14 : గత కొంత కాలంగా సంచలనం సృష్టిస్తున్న రైతుబంధు చెక్కుల దుర్వినియోగం కేసును నల్లగొండ జిల్లా పోలీసులు ఛేదించినట్లు అదనపు ఎస్పీ నర్మద తెలియజేశారు.

ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ నర్మద కేసు వివరాలు, దుర్వినియోగం అయిన చెక్కులు, కేసుతో సంబంధం ఉన్న బ్యాంకు, రెవిన్యూ అధికారులు, దళారుల వివరాలను వెల్లడించారు.

తెలంగాణ ప్రభుత్వం 2018 సంవత్సరం మే నెలలో రైతాంగానికి వ్యవసాయ పెట్టుబడి కోసం ఎకరానికి రూ.4,000/- చొప్పున అందించడానికి రైతు బంధు పథకం ప్రవేశపెట్టింది. నల్లగొండ జిల్లాలోని గుర్రంపోడు, పెద్ద అడిశర్లపల్లి, చింతపల్లి, నాంపల్లి, చండూర్ మండలాల పరిధిలో రైతాంగానికి చెక్కులు పంపిణీ చేసిన తర్వాత చనిపోయిన వారి పేర్ల మీద, భూమి వివరాలు తప్పుగా పడిన వారి పేర్ల మీద, ఇతర ప్రాంతాలలో ఉంటూ చెక్కులు తీసుకొని రైతుల పేర్ల మీద వచ్చిన చెక్కులను కొందరు రెవిన్యూ అధికారులు, మద్యదళారీలు, బ్యాంకు అధికారులతో కలిసి కుమ్మక్కై అక్రమంగా 547 చెక్కుల ద్వారా రూ. 61,50,460/- నగదును డ్రా చేసి రైతాంగాన్ని, ప్రభుత్వాన్ని మోసం చేశారని ఆమె వివరించారు.

ఈ మొత్తం వ్యవహారంలో 5 మండలాల పరిధిలో 5 క్రిమినల్ కేసులను నమోదు చేసి 23 మందిని రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ వివరించారు.

ఈ కేసు విచారణలో సమర్ధవంతంగా పని చేసిన దేవరకొండ డిఎస్పీ ఆనంద్ రెడ్డి, నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, మల్లేపల్లి సిఐ రవీందర్, నాంపల్లి సిఐ సత్యం, చండూర్ సిఐ మధు, గుర్రంపోడు ఎస్.ఐ. శీనయ్య, గుడిపల్లి ఎస్.ఐ. వీరబాబు, నాంపల్లి ఎస్.ఐ. రఫీ, చింతపల్లి ఎస్.ఐ. వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బందికి ఎస్పీ అభినందనలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here