Home తెలంగాణ కరోనా బారిన పడిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం

కరోనా బారిన పడిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం

315
0
Financial Assistance
Press Academy Chairman Allam Narayana

(ప్రజాలక్ష్యం ప్రతినిధి – హైదరాబాద్)
సెప్టెంబర్ 4: రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడిన 822 మంది జర్నలిస్టులకు ఇప్పటి వరకు ఒక కోటి 55 లక్షల 80 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ఇప్పటికే పాజిటివ్ వచ్చిన 681 మంది జర్నలిస్టులకు ఇరవై వేల రూపాయల చొప్పున, ఒక కోటి 36 లక్షల 20 వేల రూపాయలు, హోం క్వారంటైన్ లో ఉన్న 86 మంది జర్నలిస్టులకు పది వేల రూపాయల చొప్పున 8 లక్షల 60 వేల రూపాయలను అందిచామని తెలిపారు. వివిధ జిల్లాలకు చెందిన జర్నలిస్టులకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా కొత్తగా మరో 55 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు నిర్థారించారని, వీరికి 20 వేల రూపాయల చొప్పున 11 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం జర్నలిస్టుల ఆన్ లైన్ ఎకౌంట్లో జమ చేసినట్లు తెలిపారు. దీనితో మొత్తంగా ఇప్పటి వరకు పాజిటివ్, ప్రైమరీ కాంటాక్ట్ చేత హోంక్వారంటైన్ లో ఉన్న జర్నలిస్టులకు ఒక కోటి 55 లక్షల 80 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు ఆయన తెలిపారు.

కరోనా బారిన పడిన జర్నలిస్ట్ లు తమ వివరాలను తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ వాట్సప్ (8096677444) నెంబర్ కి పంపాలని తెలిపారు. మరిన్ని వివరాలకు మీడియా అకాడమీ మేనేజర్ లక్ష్మణ్ కుమార్ సెల్ నెంబర్ 9676647807 ని సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. కరోనా బారిన పడిన పాజిటివ్, క్వారంటైన్ జర్నలిస్టులు ప్రభుత్వ డాక్టర్లు ధృవీకరించిన మెడికల్ రిపోర్టులు మీడియా అకాడమీ కార్యాలయానికి తప్పనిసరిగా పంపించాలని ఆయన సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here