Home తెలంగాణ 42 వసంతాలు పూర్తిచేసుకున్న రామగుండం-ఎన్టీపీసీ…

42 వసంతాలు పూర్తిచేసుకున్న రామగుండం-ఎన్టీపీసీ…

561
0
Ramagundam NTPC Project
Ramagundam NTPC Project (File Photo)

– దక్షిణ భారతానికి సుధీర్ఘ సేవలు
– 200 మెగావాట్ల సామర్ధ్యం నుంచి 2600 మెగావాట్లకు
– ఎన్టీపీసీలో ఘనంగా ఆవిర్బావ వేడుకలు

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, నవంబర్‌ 13: రామగుండం-ఎన్టీపీసీ 42 వసంతాలు పూర్తి చేసుకొని శనివారం 43వ వసంతంలోకి అడుగిడుతోంది. 42 సంవత్సరాలుగా దక్షిణ భారతావనికి సుధీర్ఘ సేవలందిస్తోంది. 1978 నవంబర్‌, 14న అప్పటి ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్‌ చేతుల మీదుగా 200 మెగావాట్ల సామర్ధ్యం గల విద్యుత్‌ ప్లాంటును జాతికి అంకితం చేశారు. 1978 నుంచి ఇప్పటి వరకు నిరాటంకంగా విద్యుత్‌ ఉత్పత్తిని సాధిస్తున్నది.

ప్రస్తుతం రామగుండం-ఎన్టీపీసీలో 7 యూనిట్ల నుంచి విద్యుత్‌ను దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు అందిస్తున్నది. రామగుండం ప్లాంట్‌ దక్షిణ భారతదేశంలో అతిపెద్ద విద్యుత్‌ కేంద్రంగా పేరుగాంచింది. అదే విధంగా ప్రస్తుతం ఉన్న 10 మెగావాట్ల సోలార్‌ పివి ప్లాంట్‌తో పాటు త్వరలోనే ఉత్పత్తి ప్రారంభించనున్న తెలంగాణ ప్రాజెక్టు నుంచి 1600 థర్మల్‌ విద్యుత్‌, 100 మెగావాట్ల తేలియాడే సోలార్‌ విద్యుత్‌ను కూడా రామగుండం-ఎన్టీపీసీ అందించనుంది. తెలంగాణ, సోలార్ ప్రాజెక్టుల ద్వారా 1700 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తితో రామగుండం-ఎన్టీపీసీ మరింత బలోపేతం కానుంది.

On November 14, 1978, then Prime Minister Morarji Desai dedicated a 200 MW power plant to the nation
On November 14, 1978, then Prime Minister Morarji Desai dedicated a 200 MW power plant to the nation

ప్రస్తుత కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రాజెక్టు నిర్మాణంలో కొంత అంతరాయం ఉన్నప్పటికి సవాల్‌ను తట్టుకుని విద్యుత్‌ ఉత్పత్తిలో, నిర్మాణంలో పనితీరును కనబరిచింది. కరోనా మహమ్మారితో ఉద్యోగుల్లో స్ఫూర్తి నింపింది. నిరంతరం విద్యుత్‌ను సరఫరా చేస్తున్నది. రామగుండం-ఎన్టీపీసీ విద్యుత్‌ ఉత్పత్తిలో సమర్ధవంతమైన భూమికను పోషిస్తోంది.

2020-21లో అక్టోబర్‌ వరకు ప్లాంట్‌ పనితీరు:

అక్టోబర్‌ 2020 వరకు రామగుండం అవగాహన ఒప్పందానికి వ్యతిరేకంగా 9251 ఎంయులను (69.28శాతం ఉత్పత్తి చేసింది. 9217 ఎంయులు (పిఎల్‌ఎఫ్‌ 69.02శాతం). రామగుండం వార్షిక  లక్ష్యాన్ని సాధించడానికి సిద్ధంగా ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఎన్‌టిపిసి రామగుండం చౌకైన విద్యుత్తును వినియోగదారులకు అందించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది.  గ్రిడ్‌ క్రమశిక్షణను కొనసాగించడానికి నిబంధనలు పాటిస్తూ చురుకైన విధానంతో అక్టోబర్‌ 2020 వరకు ర్యాంప్‌ రేటు 84 శాతం సాధించినది.

పర్యావరణం సమతౌల్యంః

Ramagundam NTPC Plant
Ramagundam NTPC Plant

పర్యావరణ, కార్యాచరణ మార్గదర్శకాలకు అనుగుణంగా రామగుండం-ఎన్టీపీసీ ప్రధానంగా దృష్టిసారిస్తున్నది. పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడుకోవడం, ప్రకృతి, అభివద్ధికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నది.

యాష్‌ యుటిలైజేషన్‌:

గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో రామగుండం స్టేషన్‌  100శాతం యాష్‌ యుటిలైజేషన్‌ సాధించింది. యాష్‌ యుటిలైజేషన్లో అద్భుతమైన పనితీరును కొనసాగిస్తోంది. కోవిడ్‌ అంతరాయం ఉన్నప్పటికి  అక్టోబర్‌ నాటికి 74శాతం సాధించింది, మరింత సాధించడానికి సిద్ధంగా ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 100శాతం కంటే ఎక్కువ యాష్‌ జనరేట్‌ చేయనుంది.

భద్రతః

భద్రతా అంశాలు నిర్మాణ దశలో లేదా రోజు వారీ సమయంలో ఎన్‌టిపిసి ఉద్యోగుల ఆరోగ్యం భద్రతపై దృష్టి పెడుతుంది. అంతిమ లక్ష్యం ప్రజలకు, పొరుగువారికి హాని కలిగించ కుండా చర్యలు తీసుకుంటుంది.ఎన్‌టిపిసి-రామగుండం సురక్షితమైన పని వాతావరణాన్ని అందించడానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తుంది. ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ కార్మికులలో భద్రతాపై అవగాహన కల్పిస్తోంది.

పునరుత్పాదక శక్తి విభాగంలో పోర్ట్‌ఫోలియోను పెంచడం:

10 mw NTPC Solar Plant
10 mw NTPC Solar Plant

పునరుత్పాదక ఇంధన విభాగంలో పోర్ట్‌ఫోలియోను రామగుండం-ఎన్టీపీసీ పెంచుతుంది. డిసెంబర్‌ 31, 2013న 10 మెగావాట్ల సోలార్‌ పివి ప్లాంట్‌ ఏర్పాటు చేసింది. ఎన్టిపిసి సోలార్‌ ప్లాంట్లలో ఒకటి పీవీ ప్లాంటుగా వుంటుంది. రామగుండం 100 మెగావాట్ల సోలార్ యూనిట్ ను ఏర్పాటు చేస్తోంది. ఫ్లోటింగ్‌ సోలార్‌ పీవీ ప్రాజెక్ట్‌ (భారతదేశంలో ఈ విభాగంలో అతిపెద్దది), దాని జలాశయంలో సెటప్‌ చేయాల్సి వుంది.  ఈ ప్లాంట్‌ రిజర్వా యర్‌లో 450 ఎకరాల నీటి ఉపరితల వైశాల్యంలో విస్తరించి వుంటుంది. వచ్చే ఆరు నెలల్లో కమిషన్‌ చేయాలని ప్రయత్నిస్తుంది.

తెలంగాణ ప్రాజెక్ట్‌ న్యూ హారిజన్‌:

NPTC Telangana Project
NPTC Telangana Project

తెలంగాణ స్టేజ్‌ -1 (2I800 మెగావాట్లు) అత్యాధునిక అల్ట్రా సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీని అవలంబిస్తోంది. ఇది బొగ్గు వినియోగాన్ని భారీగా తగ్గించడంలో సహాయపడుతుంది. సాంప్రదాయ స్విచ్‌ యార్డుతో పోలిస్తే తక్కువ స్థలం అవసరమయ్యే స్విచ్‌యార్డ్‌ వ్యవస్థ వుంది. ఈ ప్రాజెక్ట్‌ పవర్‌ ఇండియా ద్వారా అంతర్నిర్మిత ఫ్లూగ్యాస్‌ డి-సల్ఫరైజేషన్‌ వ్యవస్థను కలిగి ఉంది.

నిర్మాణంలో మానవశక్తిని, సామగ్రిని సమీకరించడంలో కోవిడ్‌ -19 అంతరాయం కలిగించింది. ఇప్పుడు కాంట్రాక్ట్‌ కార్మికుల లభ్యతతో సమిష్టి ప్రయత్నాలతో అన్ని రంగాలలో పురోగతి సాధించి  ప్రాజెక్ట్‌ నిర్మాణ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయి. 1600 మెగావాట్ల తెలంగాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ ఫేజ్‌ -1 2021-22 ఆర్థిక సంవత్సరంలో రెండు యూనిట్ల పూర్తి చేసుకోనుంది. ఇది అభివద్ధికి ప్రేరణనిస్తుంది. తెలంగాణకు గరిష్ట శక్తి లభిస్తుందని రామగుండం-ఎన్టీపీసీ తెలిపింది.

అవార్డులుః

ఎన్టిపిసి-రామగుండం దాదాపు అనేక పురస్కారాలను సాధించింది. విద్యుత్‌ ఉత్పత్తిలో ఇటీవలి కాలంలో అవార్డులను అందుకుంది. నేషనల్‌ ఎనర్జీ లీడర్‌ అవార్డు 2019-2020, ఎక్సలెంట్‌ ఎనర్జీ ఎఫిసియెంట్‌ అవార్డు-2020, ముంబైలోని నేషనల్‌ సేఫ్టీ కౌన్సిల్‌ నుండిల్డెన్‌ నెమలి అవార్డు 2020, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ప్రశంసా పత్ర అవార్డు రామగుండం-ఎన్టీపీసీ సొంతం చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here