Home తెలంగాణ పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా స్వచ్ఛతా హి-సేవా

పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా స్వచ్ఛతా హి-సేవా

401
0
Involved in the Swachhata Hi Seva
MOCP employees involved in the Swachhata Hi Seva programme

-ఎంఓసీపీ ప్రాజెక్టు ఆఫీసర్‌ సత్యనారాయణ

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్‌ 9: పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా స్వచ్ఛతా హి-సేవా కార్యక్రమం కొనసాగుతుందని మేడిపల్లి ఓసీపీ  ప్రాజెక్టు ఆఫీసర్‌ సత్యనారాయణ అన్నారు. మహాత్మా గాందీ 151వ జన్మదినాన్ని పురస్కరించుకుని సింగరేణి సంస్థ స్వచ్ఛతా మాసోత్సవాల కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో బాగంగానే శుక్రవారం స్వచ్ఛతా హి-సేవా కార్యక్రమాన్ని మేడిపల్లి ఓపెన్‌కాస్టులో నిర్వహించారు.

ఈ సందర్బంగా ప్రాజెక్టు ఆఫీసర్‌ మాట్లాడుతూ… నీరు, పారిశుధ్యం, పరిసరాలు పరి శుభ్రంగా ఉంచుకోవాన్నారు. స్వచ్చతా హి-సేవా కార్యక్రమాన్ని నెల రోజుల పాటు కొనసాగు తుందని తెలిపారు. స్వచ్చతా మాసోత్సవాలు దేశ అభివృద్ధిలో ముఖ్య భూమికను పోషిస్తున్నదన్నారు. దేశం మొత్తం ఈ స్వచ్చతా మాసోత్సవాలు నిర్వహిస్తుందని తెలిపారు. గహాలను శుభ్రంగా ఉంచుకున్నట్లే పరిసరాలను కూడా వుంచుకోవాలని సూచించారు. గుడ్డ సంచులను వాడి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని నిర్మూలించాలని తెలిపారు. అనంతరం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పాడాలని ప్రతిజ్ణ చేశారు.

Workers vowing
MOCP employees vowing in a Swachhata hi seva programme

ఈ కార్యక్రమంలో టిబిజికెఎస్‌ ఉపాధ్యక్షులు గండ్ర దామోదర్‌ రావు, మేనేజర్‌ గోవిందరావు, పిట్‌ సెక్రటరీ పి.రాంచందర్‌, సర్వే ఆఫీసర్‌ మహమద్‌ అలీ, ఎన్‌.వి.రావు, సీనియర్‌ పి.ఒ సారంగపాణి, అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here