Home సినిమా గాన గంధర్వుడు… బహుముఖ ప్రజ్ఞాశాలి… బాలు ఇక లేరు…

గాన గంధర్వుడు… బహుముఖ ప్రజ్ఞాశాలి… బాలు ఇక లేరు…

1888
0
S.P. Balasubrahmanyam
S.P. Balasubrahmanyam

(ప్రజాలక్ష్యం డెస్క్‌ – సెప్టెంబర్ 25)
పాటనే శ్వాసగా బ్రతికిన సుప్రసిద్ధ గాయకుడు ఎస్‌.పి బాలసుబ్రహ్మణ్యం అస్తమించారు. చెన్నై ఎంజిఎం అసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 1.04 నిముషాలకు కన్నుమూసారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఎస్‌.పి. చర్‌ణ్‌ విషాదవదనంతో ప్రకటించారు. మీరు అందరూ ఉండేంత వరకు మా నాన్న మాతోనే వుంటారని, పాటకు మరణం లేదని చరణ్‌ తెలిపారు.

కరోనా పాజిటివ్‌ వచ్చిన బాలసుబ్రహ్మణ్యం చికిత్స కోసం ఎం.జి.ఎం ఆసుపత్రిలో ఆగష్టు 5న చేరారు. కరోనాతో కోలుకున్నప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసారు. అత్యాధునిక చికిత్సలు అందించినప్పటికి ఆయన కోలుకోలేక పోయారు.. బాలు మరణంతో యావత్‌ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. మిత్రులు, శ్రేయోభిలాషులు, సినీప్రముఖులు, రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు.

Balu in MGM Hospital
S.P. Balu in MGM Hospital at Chennai

ఎస్‌.పీ. బాలసుబ్రహ్మణ్యం ప్రస్థానం…

ఎస్‌. పి. బాల సుబ్రహ్మణ్యంగా పిలవబడే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకుపైగా పాటలు పాడాడు. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుస్తారు. ఈయన నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో 1946 జూన్‌ 4న జన్మించాడు.

తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్‌ కోర్సులో చేరాడు. చదువు కుంటూనే వేదికల మీద పాటలు పాడుతూ పాల్గొంటూ బహుమతులు సాధించాడు. 1966 లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత మరిన్ని అవకాశాలు తలుపు తట్టాయి. మొదట్లో ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. చాలా మంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలికి అనుగుణంగా పాటలు పాడేవాడు.

Gana Gandharva Balu
Gana Gandharva Balu

1969 లో మొదటిసారిగా నటుడిగా కనిపించిన ఈయన తర్వాత కొన్ని అతిథి పాత్రల్లో నటించాడు. తర్వాత అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించాడు. ప్రేమ (1989), ప్రేమికుడు (1994), పవిత్రబంధం (1996), ఆరో ప్రాణం (1997), రక్షకుడు (1997), దీర్ఘ సుమంగళీ భవ (1998) మొదలైనవి ఆయన నటించిన కొన్ని సినిమాలు. బాలు డబ్బింగ్‌ ఆర్టిస్టుగా అనేకమంది కళాకారులకు గాత్రదానం చేశాడు. కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌, సల్మాన్‌ ఖాన్‌, విష్ణువర్ధన్‌, జెమిని గణేశన్‌, గిరీష్‌ కర్నాడ్‌, అర్జున్‌, నగేష్‌, రఘువరన్‌ లాంటి వాళ్ళకి గాత్రదానం చేసాడు.

సినిమాల్లోనే కాక టి.వి రంగంలో ఆయన పాడుతా తీయగా, పాడాలని ఉంది లాంటి కార్యక్రమాలను నిర్వహించి ఎంతోమంది నూతన గాయనీ గాయకులను పరిచయం చేశాడు. ఇవి కాకుండా ఈటీవీలో ప్రసారమైన స్వరాభిషేకం లాంటి కార్యక్రమాల్లో తన గానాన్ని వినిపించాడు.
బాలుకు భారతదేశ కేంద్రప్రభుత్వం నుండి 2001 లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2011 లో పద్మభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నాడు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నాడు. 2012 లో ఆయన నటించిన మిథునం సినిమాకు గాను నంది ప్రత్యేక బహుమతి లభించింది.

బాల్యం, విద్యాభ్యాసం

బాలసుబ్రహ్మణ్యం 1946, జూన్‌ 4 న నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. బాలు తండ్రి సాంబమూర్తి, పేరొందిన హరికథా పండితుడు. తల్లి శకుంతలమ్మ. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు కల పెద్ద కుటుంబములో బాలసుబ్రహ్మణ్యం రెండవ కుమారుడుగా జన్మించాడు.

బాల్యమునుండే బాలుకు పాటలు పాడటము ఒక హాబీగా ఉండేది. తండ్రి కోరిక మేరకు ఇంజనీరు కావాలనే ఆశయముతో మద్రాసులో ఎఎంఐఈ కోర్సులో చేరాడు. ఆ కాలము లోనే వివిధ పాటల పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకొన్నాడు బాలు. బాల సుబ్రహ్మణ్యం చదువుకునే రోజుల్లోనూ, ఆ తర్వాత పాటలు పాడే రోజుల్లో కొన్నేళ్ళు మంచి ఇంజనీర్‌ కావాలని, ప్రభుత్వ శాఖల్లో ఇంజనీరుగా పనిచేయాలని కలలు కనేవాడు.

వృత్తి, జీవితం

Balu with wife
Balasubrahmanyam with wife

బాల బాలసుబ్రహ్మణ్యం మద్రాసులో ఎ.ఎం.ఐ.ఇ చదువుకుంటున్న సమయంలో బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేసారు. 1966లో నటుడు, నిర్మాత అయిన పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీగాయకునిగా చలన చిత్ర గాయక జీవితం ప్రారంభించాడు. ఈ చిత్రానికి ఎస్‌.పి.కోదండపాణి సంగీత దర్శకత్వము వహించాడు. తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్‌కు ”కోదండపాణి ఆడియో ల్యాబ్స్‌” అని అతని పేరే పెట్టుకున్నాడు బాలు.

చాలామంది నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా అతను పాటలు పాడి ప్రాణం పోశారు. అందుకే అమరగాయకుడు ఘంటసాల తరువాత తెలుగు సినీ పాటకు సిసలయిన వారసుడిగా నిలిచారు. పదాల మాదుర్యాన్ని గమనించి అతను చేసే ఉచ్చారణ అతని పాటను పండిత పామరులకి చేరువ చేసింది. శంకరాభరణం, సాగరసంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ఏక్‌ దుజే కేలియే లాంటి హిందీ చిత్రాలకు అతను పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. 40 ఏళ్ళ సినీప్రస్తానంలో 40 వేల పాటలు 11 భాషలలో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచములోనే ఒక అరుదయిన రికార్డు సష్టించాడు.

Award from Venkaiah Naidu
Award over the hands of Venkaiah Naidu

తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలో కూడా అతను పాడిన పాటలకి జాతీయ పురస్కారాలు లభించాయి. గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నంది పురస్కారాన్ని 29సార్లు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ గాన గంధర్వుడు. 2016 నవంబరులో గోవాలో జరిగిన 47 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో అతనికి శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారాన్ని (సెంటినరీ అవార్డ్‌ ఫర్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ 2016) ప్రదానం చేసారు.

నటునిగా 1969లో వచ్చిన పెళ్ళంటే నూరేళ్ళ పంట అనే చిత్రంలో మొదటిసారిగా నటుడిగా కనిపించాడు బాలు. 1990 లో తమిళంలో వచ్చిన కేలడి కన్మణి అనే చిత్రంలో బాలు కథానాయకుడినా నటించాడు. ఇందులో రాధిక కథానాయిక. ఈ సినిమా తెలుగులో ఓ పాప లాలీ అనే పేరుతో అనువాదం అయింది. ఇంకా ప్రేమ (1989), ప్రేమికుడు (1994), పవిత్రబంధం (1996), ఆరో ప్రాణం (1997), రక్షకుడు (1997), దీర్ఘ సుమంగళీ భవ (1998) వంటి సినిమాల్లో ప్రాధాన్యత కలిగిన సహాయ పాత్రలు నటించాడు. 2012 లో తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన మిథునం సినిమాలో కథానాయకుడిగా కనిపించాడు బాలు. ఇందులో లక్ష్మి నాయికగా నటించింది. ఈ సినిమాకు నంది ప్రత్యేక పురస్కారం లభించింది.

డబ్బింగ్‌ కళాకారుడిగా

కె. బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద చిత్రం మన్మధ లీలతో బాలు అనుకోకుండా డబ్బింగ్‌ ఆర్టిస్టుగా మారాడు. అందులో కమల్‌ హాసన్‌ కు తెలుగులో డబ్బింగ్‌ చెప్పాడు. తర్వాత ఆయన కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌, సల్మాన్‌ ఖాన్‌, భాగ్యరాజ్‌, మోహన్‌, విష్ణువర్ధన్‌, జెమిని గణేశన్‌, గిరీష్‌ కర్నాడ్‌, అర్జున్‌, కార్తీక్‌, నగేష్‌, రఘువరన్‌ లాంటి వారికి పలు భాషల్లో గాత్రదానం చేశాడు. తమిళం నుంచి తెలుగులోకి అనువాదమయ్యే కమల్‌ హాసన్‌ చిత్రాలన్నింటికి ఈయనే డబ్బింగ్‌ చెబుతుండేవాడు.

Honorary awaradd
Honorary Award to SP Balu

2010లో కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా వచ్చిన దశావతారం చిత్రంలో కమల్‌ పోషించిన పది పాత్రల్లో 7 పాత్రలకు బాలునే డబ్బింగ్‌ చెప్పడం విశేషం. ఇందులో కమల్‌ పోషించిన ముసలావిడ పాత్ర కూడా ఉంది. అన్నమయ్య చిత్రంలో సుమన్‌ పోషించిన వేంకటేశ్వర స్వామి పాత్రకు, సాయి మహిమ చిత్రంలో బాలు డబ్బింగ్‌ చెప్పాడు. ఈ రెండు చిత్రాలకు ఆయనకు ఉత్తమ డబ్బింగ్‌ కళాకారుడిగా నంది పురస్కారం లభించింది.

ఈటీవీలో పాడుతా తీయగా అనే కార్యక్రమంతో బాలసుబ్రహ్మణ్యం బుల్లితెర ప్రవేశం చేసాడు. అనేక మంది కొత్త గాయనీ గాయకులను ఈ కార్యక్రమం ద్వారా పరిచయం చేసాడు. 1996 లో మొదలైన ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది.

వ్యక్తిగత జీవితం

Balu Family
S.P. Balu’s Family

నెల్లూరు లోని శ్రీ కస్తూర్బా కళాక్షేత్రంలో బాలసుబ్రహ్మణ్యం అవిష్కరించిన తన తండ్రి సాంబమూర్తి విగ్రహం బాలుకు సావిత్రితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. పల్లవి, ఎస్‌. పి. చరణ్‌. కొడుకు ఎస్‌. పి. చరణ్‌ కొన్ని సినిమాల్లో పాటలు పాడి, తర్వాత సినీ నిర్మాతగా కూడా మారాడు. బాలు సోదరి ఎస్‌. పి. శైలజ కూడా సినీ నేపథ్య గాయని. ఈమె సోదరునితో కలిసి పలు చిత్రాల్లో పాటలు పాడింది. ఈమె నటుడు శుభలేఖ సుధాకర్‌ ను వివాహమాడింది. బాలు తల్లి శకుంతలమ్మ 2019 ఫిబ్రవరి 4 న 89 సంవత్సరాల వయసులో నెల్లూరులో మరణించింది.

ఎస్‌. పి. బాలసుబ్రహ్మణ్యం అందుకున్న పురస్కారాలు

భారతీయ భాషల్లో ఆయన సుమారు 40 వేలకు పైగా పాటలు పాడాడు. అత్యధిక పాటలు రికార్డు చేసిన గాయకుడిగా ఆయన పేరిట ఒక రికార్డు ఉంది ఆయన సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు, 6 ఫిల్మ్‌ ఫేర్‌ దక్షిణాది పురస్కారాలు, ఒక ఫిల్మ్‌ ఫేర్‌ పురస్కారం అందుకున్నాడు. 1979 లో వచ్చిన సంగీత ప్రధానమైన శంకరాభరణం చిత్రానికి ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. రెండు సంవత్సరాల తర్వాత ఆయనకు 1981 లో బాలీవుడ్‌ లో ప్రవేశించి ఏక్‌ దూజే కేలియే చిత్రానికి గాను రెండోసారి పురస్కారాన్ని అందుకున్నాడు.

movie wards
Movie wards

తర్వాత సాగర సంగమం (1983), రుద్రవీణ (1988) చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నాడు. 25 సార్లు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్‌ ఆర్టిస్టుగా, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నాడు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నాడు. 2001 లో పద్మశ్రీ, 1999లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం డాక్టరేటు, 2011 ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ గవర్నరు రంగరాజన్‌ చేతుల మీదుగా పద్మభూషణ్‌, 2016లో శత వసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారం, 2012లో కేంద్ర సమాచారా ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా నంది పురస్కారం ఇలా ఎన్నో పురస్కారాలు పొందారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here