చికోటి ప్రవీణ్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
– లంబాడా హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నునావత్ గణేష్ నాయక్ డిమాండ్

కామారెడ్డి జిల్లా, జూలై 28 ( లోకంతీరు ) : పూలే అంబేద్కర్ వారసుడు దళిత బహుజన మేధావి, బడుగు బలహీన వర్గాల కోసం అను నిత్యం బహుజన సమాజం కోసం పోరాడుతున్న హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ కదిరీ కృష్ణ పై పెట్టిన పోలీస్ కేసును వాపసు తీసుకోవాలని లంబాడా హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నునావత్ గణేష్ నాయక్ కోరారు. బెదిరింపులకు పాల్పడుతున్న చికోటి ప్రవీణ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆదివారం జిల్లా కేంద్రంలో పత్రిక ప్రకటలో డిమాండ్ చేశారు. లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా రాస్తారోకో చేస్తామని హెచ్చరించారు.