Home ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా లక్ష్మీపార్వతి

తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా లక్ష్మీపార్వతి

486
0
laxmi-parvathi-appointed-telugu-academy-chairperson
laxmi-parvathi-appointed-telugu-academy-chairperson

వైఎస్సార్‌సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతికి కీలక పదవి దక్కింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆమెను తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా నియమించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్‌ దీనికి సంబంధించి నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

లక్ష్మీ పార్వతి తెలుగు విశ్వవిద్యాలయంలో పీజీ చేశారు. 2000 సంవత్సరంలో ఆమె తెలుగు సాహిత్యంలో ఎమ్‌. ఎ పూర్తి చేశారు. గత కొన్నేళ్లుగా ఆమె వైఎస్సార్‌సీపీ పార్టీకి సేవలందిస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here