ఆర్ఎంపీలు, పీఎంపీలు ప్రథమ చికిత్సలు మాత్రమే అందించాలి
– డాక్టర్ సురేష్

రామారెడ్డి, ఆగస్టు 28 ( లోకంతీరు ) : రామారెడ్డి మండల కేంద్రంలో గల పీఎంపీ,ఆర్ఎంపి ల క్లినిక్ లను ఆకస్మిక తనికి చేసిన వైద్యాధికారి డాక్టర్ ఎం. సురేష్,వైద్య సిబ్బంది. డాక్టర్సురేష్ మాట్లాడుతూ జిల్లా వైద్యాధికారి యొక్క ఆదేశాల మేరకు మండల కేంద్రములో గల పీఎంపి , ఆర్ఎం క్లినిక్ లను ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఎవరైనా తమ పరిది లో మాత్రమే ప్రజలకు ప్రధమ చికిత్స సేవలు అందించాలి మీరు పరిదీలు దాటి యాంటీబయాటిక్, గ్లూకోస్లను పెట్టకూడదని తెలపడం జరిగింది.పరిధి దాటి ఎవరైనా వైద్యం చేసినచో వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చి వారి క్లినిక్ లను సీజ్ చేయబడును అని తెలిపారు. ఇక నుండి ప్రతి రోజూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించబడును అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జార్జి,వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.