ఏషియన్ గేమ్స్ లో జిల్లా క్రీడాకారుల సత్తా

కామారెడ్డి జిల్లా, ఆగష్టు 14 (లోకంతీరు) : ఏషియన్ గేమ్స్ లో తెలంగాణలోని కామారెడ్డి జిల్లాకు చెందిన క్రీడాకారులు చెస్, బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో సత్తా చాటారు. పిట్లం కు చెందిన తక్కడపల్లి ప్రతిభ ఐదు బంగారు, వెండి పతకాలు సాధించారు. విజయ రాఘవేందర్ రెండు వెండి పతకాలు పొందారు. ఏషియన్ గేమ్స్ లో ఒకటి, ఇండియన్ ఓపెన్ గేమ్ లో ఒకటి చొప్పున పతకాలు పొందారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన తక్కడపల్లి ప్రతిభ, విజయ రాఘవేందర్ లకు శాలువాలు కప్పి అభినందించారు.