మైనారిటీ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం ను సన్మానించిన మైనారిటీ నాయకులు

కామారెడ్డి జిల్లా / లింగంపేట్, సెప్టెంబర్ 05 ( లోకంతీరు ) : లింగంపేట్ మండల కేంద్రంలో మైనారిటీ రెసిడెన్షియల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం ను అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పాఠశాలలో వేడుకలు నిర్వహించారు. మండల కేంద్రం మైనారిటీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటరాములు, ఉపాధ్యాయ బృందం చేస్తున్న సేవలు గుర్తించి వారిని ఘనగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నారా గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఫీయొద్దీన్, పట్టణ అధ్యక్షులు ప్రసాద్ గౌడ్, యువజన అధ్యక్షులు రాజు, మండల మైనార్టీ నాయకులు అర్షద్, ఇర్ఫాన్, అశోక్, రాజు, సోషల్ మీడియా నాగేష్, రాజు, రమేష్, సాయి గౌడ్, సంగమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.