అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టాక్టర్ల పట్టివేత.

బాన్సువాడ/కోటగిరి, ఫిబ్రవరి 13( లోకంతీరు ) : బాన్సువాడ నియోజక వర్గం పోతంగల్ మండల కేంద్రంలో సోమవారం రాత్రి విశ్వసనీయ సమాచారం మేరకు మంజీర నది నుంచి అక్రమంగా తరలిస్తున్న 4 ఇసుక ట్రాక్టర్లును కోటగిరి పోలీసులు పట్టుకున్నారు.తగు చర్యల నిమిత్తం సంబంధిత అధికారులకు ఇసుక ట్రాక్టర్ అప్పగించడం జరుగుతుందని ఎస్ఐ సందీప్ కుమార్ తెలిపారు. ఉమ్మడి మండలంలో ఎవరైనా అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అలాగే వేబీల్ ఉన్న వారు సంబంధిత అధికారులు తెలిపిన సమయంలో మాత్రమే వాహనాలను నడపాలని ఆయన సూచించారు.