నూతన పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎస్సైకి సన్మానం

రామారెడ్డి, ఫిబ్రవరి 20 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి నూతనంగా వచ్చిన ఎస్ఐ ని విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ సభ్యులు సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది. అలాగే శివాజీ జయంతి ర్యాలీ కి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు డి శ్రీనివాస్ , విశ్వహిందూ పరిషత్ జిల్లా జాయింట్ సెక్రెటరీ దండ బోయిన గంగాధర్, విశ్వహిందూ పరిషత్ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి, బజరంగ్దళ్ విలేజ్ ప్రెసిడెంట్ నేరెళ్ల నాగరాజు, బజరంగ్దళ్ టీం కడెం సాయి, పిప్పిరి గణేష్, బండి ప్రవీణ్, వడ్ల అభినయ్, ఒద్దే నితీశ్, పాల్గొనడం జరిగింది.