మండల భారతీయ కిసాన్ సంఘ్ కమిటీ ఎన్నిక

కామారెడ్డి జిల్లా /రాజంపేట, సెప్టెంబర్ 27 ( లోకంతీరు ) : భారతీయ కిసాన్ సంఘ్ రాజంపేట మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా శుక్రవారం ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా మర్రి గోపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా కామ్ శెట్టి శంకర్, పాశం సిద్ధిరాములు, ప్రధాన కార్యదర్శిగా శెట్టి గాడి రామ చంద్రం, ముఖ్య సలహాదారులుగా వెల్మ రాంరెడ్డి, ఎస్.యాదవ రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా బాణాల గంగారెడ్డి, గడ్డం బాలరాజ్ రెడ్డి, ఎం.రాజు, కుంటా వీరారెడ్డి, గోపాలపురం రాజు, అల్లకొండ రమేష్ రెడ్డి, వెల్మ సుధాకర్ రెడ్డి, కాటిపల్లి సంజీవరెడ్డి లను ఎన్నుకున్నారు.