పిప్రి గ్రామ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మంది కాంగ్రెస్ పార్టీలో చేరిక


భీంగల్, ఏప్రిల్ 14 ( లోకంతీరు ) : భీంగల్ మండలం పిప్రి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు 50 మంది ఈరోజు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.చేరిన వారిలో సొసైటీ డైరెక్టర్ అరిగేల జనార్ధన్ మరియు టిఆర్ఎస్ గ్రామ శాఖ యూత్ అధ్యక్షుడు వెన్నెల సందీప్ మరియు గ్రామ కమిటీ అధ్యక్షుడు దుర్గి దామోదర్ గౌడ్,సూర దశరథ్, బట్టు శేఖర్, బట్టు కార్తీక్, వెన్నెల సుధీర్, మంతెన నరేష్, పెండ రాజు, గొట్టి రాజన్న ,వినోద్ మరో 30 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీ తో గెలిచే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో పిప్రి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పతాని జేమ్స్ మరియు రాజేష్ పల్లె శేఖర్,కోరాడి లింబాద్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.