రన్ మారథాన్ అంబాసిడర్ గా…
వేల్పూర్ వాసి ఎంపిక

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి , జులై 21 ( లోకంతీరు ) :ఆగస్టు 11న హైదరాబాద్ లో నిర్వహించనున్న రన్ మారథాన్ కు వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన గుగ్గిల్ల అశోక్ ఎంపికైనట్లు అశోక్ మిత్రుడు ఏలేటి చిన్నారెడ్డి తెలిపాడు.
అశోక్ మిత్రుడు అందించిన వివరాల ప్రకారం.గుగ్గిల్ల అశోక్ 5 రాష్ట్రాలకు చెందిన రన్ అంబాసిడర్ గా ఎంపికైనట్లు ఆయన చెప్పాడు.5 రాష్ట్రాల రన్ అంబాసిడర్ గా ఎంపికైన అశోక్ విజయాలను తెలిపే ప్లెక్సీలను రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం హర్షణీయమన్నాడు. వేల్పూరు ప్రజలు అలాగే తన స్నేహితులు సుంకరి కృష్ణ, రాజేందర్ ,మహేష్ సునీల్ ,చంటి,అశోక్ అభినందించారు.