ఉచితంగా హోమియో మందులు పంపిణీ

కామారెడ్డి జిల్లా , జూలై 21 ( లోకంతీరు ) : శ్రీ రాఘవేంద్ర హోమియో క్లినిక్ డా. హరీష్ గౌడ్ ఆదివారం ఉచితంగా హోమియో మందులు పంపిణీ చేశారు. ప్రజలు వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల భారీ నుంచి ఉపశమనం పొందడానికి, చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా లాంటి విష జ్వరాల నివారణ కొరకు శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి కల్కి దేవాలయంలో కామారెడ్డి కొత్త బస్టాండ్ ఆవరణలో దాదాపు 800 నుంచి 1000 మంది ప్రయాణికులకు ఉచితంగా హోమియో మందులు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమాన్ని సేవాసమితి సభ్యులు సమయాన్ని ఇచ్చినటువంటి శ్రీ రాఘవేంద్ర హోమియో క్లినిక్ డాక్టర్ హరీష్ గౌడ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవకులు, భక్తులు పాల్గొన్నారు.