స్వర్ణకార సంఘం మండల అధ్యక్షుడిగా నవీన్ కుమార్ చారి

ఎల్లారెడ్డి ,ఆగస్టు 21 (లోకంతీరు) : ఎల్లారెడ్డి మండల స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా ఎస్ నవీన్ కుమార్ చారి ఎన్నికయ్యారు. ఈ మేరకు నూతన కార్యవర్గ వివరాలను ఆయన వెల్లడించారు. మండల స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శిగా సందీప్ చారి, కోశాధికారిగా శ్రీనివాస్ చారి, ఉపాధ్యక్షులుగా బాలచంద్రం చారి, భరత్ తేజ చారి, ఉప కార్యదర్శిగా ఈశ్వర్ చారి, విఠల్ చారి, ప్రకాష్ చారి, సోషల్ మీడియా ఇన్చార్జిగా నవీన్ చారి, కార్యవర్గ సభ్యులుగా రామచంద్ర చారి, వెంకటేశ్వర్లు చారి, సుదర్శన్ చారి, సంతోష్ చారి, అభిలాష్ చారి, బ్రహ్మం చారి, సలహాదారులుగా రామచంద్ర చారి, శ్రీనివాస్ చారి, సుగుణాకర్ చారి, వెంకట్ చారి, సత్యనారాయణ చారి, సాయిబాబా చారి, రాజు చారి, బ్రహ్మం చారిలను ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు.