జనసేన అధినేతకు సంఘీభావం

కామారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 26 ( లోకంతీరు ) : తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్ర లడ్డు ప్రసాదంలో గత ఏపీ ప్రభుత్వంలో జరిగిన కల్తీ విషయమై జనసేన అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు తెలంగాణ రాష్ట్ర నాయకత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్ష సెప్టెంబరు 26 రోజుకు ఐదు రోజులు కావస్తున్న సందర్భంగా వారికి మద్దతు తెలిపాలని తెలంగాణ రాష్ట్ర జనసేన నాయకులు తెలిపారు. తేదీ 26- 9- 2024 గురువారం రోజున రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో ఒకరోజు దీక్ష చేయడం జరుగుతుందని కామారెడ్డి జిల్లా జనసేన నాయకులు నక్క మల్లేశం బుధవారం పత్రిక ప్రకటనలో తెలిపారు.