నల్లూరులో ఘనంగా శ్రీరామ శోభాయాత్ర
- అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట

ముప్కాల్, జనవరి 22 ( లోకం తీరు) : అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అత్యద్భుతంగా జరిగిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగాఅన్నదానాలు హనుమాన్ గుడి అలంకరణలు శ్రీరాముని గుడి అలంకరణలు అద్భుతంగా జరిపించారు. ప్రాణ ప్రతిష్ట జరిగిన సందర్భంగా గ్రామంలో యువకులు గ్రామస్తులు మహిళలు మంగళారతులు నృత్యాలతో ఘనంగా శోభాయా త్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నదాన కమిటీ యువకులు మహిళలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.