ఇత్వార్ పేట్ , బస్సాపూర్ లలో ఇటుక బట్టీలను పరిశీలించిన– ఎస్సై కే గోపి

బాల్కొండ నియోజకవర్గం, ఫిబ్రవరి 09 ( లోకం తీరు ) : నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం ఇత్వార్ పేట్ మరియు బస్సాపూర్ గ్రామంలోని ఉన్నటువంటి ఇటుక బట్టీలను బాల్కొండ ఎస్సై కే గోపి తనిఖీ చేశారు. ఇటుక బట్టిలలో ఎవరైనా బాల కార్మికులను నియమించుకున్నారో అని తనిఖీ చేశారు. కార్మికుల చట్టం ప్రకారం ఎవరైనా బాల కార్మికులను పెట్టుకున్నట్లయితే కఠిన చర్యలు తప్పవని యజమానులకు సూచించారు. ఇందులో భాగంగా ఇటుక బట్టీలలో కార్మికులకు అందిస్తున్న సౌకర్యాలను బట్టీ యజమానులను అడిగి తెలుసుకున్నారు.