కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ను బొంద పెట్టుడు ఖాయం.
-
కాంగ్రెస్ ప్రభుత్వం కూలి పోతుందని అవాస్తవాలు మాట్లాడడం సిగ్గుచేటు.
-
బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలను కాంగ్రెస్ పార్టీ త్వరలో బట్టబయలు చేస్తుంది.
-
డీసీసీ డెలిగేట్ సభ్యులు కొట్టం మనోహర్.

బాన్సువాడ/కోటగిరి , ఫిబ్రవరి 21 ( లోకంతీరు ) : కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో అధికారాన్ని కోల్పోతుందని బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడడం సిగ్గుచేటని,తమరి పాలనలో ఎవరెవరు ఎంత అవినీతికి పాల్పడ్డారో కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా బట్టబయలు చేస్తుందని,అతి త్వరలో బాన్సువాడ నియోజక వర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమని డిసిసి డెలిగేటి సభ్యులు, కోటగిరి ఎంపీటీసీ కొట్ట మనోహర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.బుధవారం కోటగిరి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి రెండు నెలలు కావస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులకు అంతగా అక్క ఎందుకని మండి పడ్డారు. త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని,కాంగ్రెస్ హామీలు 420 హామిలని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జోస్యం చెప్తే,మరోవైపెమో తమరి కుమారులు కాంగ్రెస్ మంత్రులను ఎమ్మెల్యేలను బహిరంగంగా కలుస్తున్న సంఘటనలు ప్రజలు గమనిస్తు నవ్వుకుంటున్నారనీ అన్నారు. ఒకరిపై ఆరోపణలు చేసేటప్పు డు తమ వ్యక్తి గత విషయాల ను సరి చేసుకోనీ మాట్లాడితే బాగుంటుందని ఎగ్దేవా చేశారు.తమరి పాలనలో తమరి కుటుంబ సభ్యులు, కార్యకర్తలు ఎంతలా అవినీతికి పాల్పడ్డారో ప్రతిదీ కాంగ్రెస్ ప్రభుత్వం బట్ట బయలు చేస్తుందని ఆయన ఘాటు వాఖ్యలు చేశారు.సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అన్ని విధాలుగా ప్రజారంజక పాలనను ఆస్వాది స్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాహిద్ హుస్సేన్, డిసిసి డెలివరీ సభ్యులు వాహిద్,మండల ఉపాధ్యక్షులు అఫ్జల్,పీరాజి,కోటగిరి పట్టణ అధ్యక్షులు అయుబ్,నాయకు లు హైమద్,దశరథ్,విఠల్, యాదుల్,రాజయ్య,కూచి శ్రీనివాస్,మునవర్,హన్మండ్లు,
,మస్తాన్,తదితరులు పాల్గొన్నారు