ఘనంగా కత్తుల మల్లన్న జాతర

బాల్కొండ , ఫిబ్రవరి 24 ( లోకంతీరు ) : బాల్కొండ మండలం బోదేపల్లి గ్రామంలో శనివారం రోజున కత్తుల మల్లన్న జాతర ఘనంగా జరిగింది, కత్తుల మల్లన్న జాతరకు అధిక సంఖ్యలో భక్తులు హాజరైనారు, ఈ కార్యక్రమాలన్నీ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరుగుతాయి, ఆదివారం రోజు మల్లన్న గుట్ట వద్ద మహా అన్నదాన ప్రసాదం జరుగుతుందని గ్రామ పెద్దలు తెలిపారు, ఇట్టి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులని తెలిపారు, భక్తులు గ్రామస్తులు ఉదయమే లేచి మల్లన్న గుట్ట వద్దకు వచ్చి వంటలు చేసుకుని కత్తుల మల్లన్నకు నైవేద్యం సమర్పించే ఒక్కపొద్దు విడవడం జరుగుతుంది, భక్తులు ముఖ్యంగా మొక్కిన ముక్కులు నెరవేరుతాయని భక్తులు తెలిపారు,