ఎస్సీ వర్గీకరణ,సుప్రీంకోర్టు తీర్పును ఖండిస్తూ..!
— హలో మాల చలో ఢిల్లీ
— జిల్లాకు పిలుపునిచ్చిన మాల మహానాడు
— ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి

కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 4 (లోకంతీరు) : అన్నతమ్ముల వలె కలిసి ఉన్న ఎస్సీ మాల మాదిగ కులాలను విడదీసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఖండిస్తూ ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మాల మహానాడు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కమిటీ నియమించడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ వద్దు కలిసి ఉంటే ముద్దు అనే నినాదాలతో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈనెల 11′ 12 తేదీలలో హలో మాల చలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం మాల మహానాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సంగం రాజలింగం కన్వీనర్ , ఎడ్ల రాజు, సుతరి సుధాకర్, ఆర్గనైజర్ తలారి బాలరాజు,పెరుమండ్ల రాజనర్సింహులు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ఎస్సీ విభజన చేసి కలిసి ఉన్న అన్నదమ్ములను వేరు చేయడం భావ్యం కాదని మండిపడ్డారు. సుప్రీం కోర్టు తీర్పు కు వ్యతిరేకంగా అప్పీలు చేస్తాం అని బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరించారు. మాలలు అంటే మోడీకి కోపమేందుకు ప్రశ్నించారు.ఈ నెలలో హలో మాల చలో ఢిల్లీ 11, 12 తేదీలలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలియ చేశారు.సుప్రీం కోర్టు జడ్జిలు ఎస్ సి వర్గీకరణ తీర్పు లో తప్పు చేశారు. అని మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టు జడ్జి లేని సహితం తమ అదుపులో ఉంచుకొని వర్గీకరణ చేశారని మండిపడ్డారు. వర్గీకరణ వద్దు కలిసి ఉంటే ముద్దు అనే నినాదాలతో గ్రామ గ్రామాల్లో జిల్లాలలో ధర్నాలు కార్యక్రమాలు నిర్వహిస్తామని అతి త్వరలో సుప్రీంకోర్టులో ఆపిల్ చేస్తాం అని
సుప్రీం కోర్టు జడ్జిలు 341 ఆర్టికల్ మార్చరన్నారు.
ఎస్ సి ఎస్ టీ ల జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్ పెంచా మంటే విభజించి పాలించడం బీజేపీ కుట్ర అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల
11, 12 తేదీలలో ఎస్ సి వర్గీకరణ ను అడ్డు కోవడానికి వేలాదిగా మాలలు తరలి రావాలి అని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గోను గోపుల లింగం , జంగం లింగం, కంకణాల రమేష్, గుర్రపు స్వామి, రాజేంద్ర, ధర్మపురి, భూపతిరాజ్, లలిత, తేజశ్రీ, మాల నాయకులు పాల్గొన్నారు.