సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులు అందజేత

కామారెడ్డి జిల్లా , ఆగస్టు 27 (లోకంతీరు) : ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని రాజంపేట మండలంలోని 17 మంది లబ్ధిదారులకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మంగళవారం అందజేసారు. రాజంపేట మండలంలోని వివిధ గ్రామాల ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో రాజంపేట మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర ప్రణీత్ రెడ్డి, ఉపాధ్యక్షులు భీమరి శ్యామయ్య, మాశెట్టి శ్రీధర్, సెక్రటరీ సంజీవ రెడ్డి, మండల నాయకులు బీరయ్య, సుధాకర్ రెడ్డి, సుభాష్ నాయక్, వివిధ గ్రామాల అధ్యక్షులు ఏనుగుల సాయిలు, శశికాంత్ రెడ్డి, నరేందర్ గౌడ్, గణేష్ నాయక్, మండల సీనియర్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.