రాష్ట్రస్థాయి కోకో పోటీలకు విద్యార్థిని ఎంపిక
కామారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 12 (లోకంతీరు) : 34 వ రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు జడ్.పి.హెచ్.ఎస్ పోసాని పెట్ విద్యార్థిని ఎంపిక అవడం జరిగింది. సబ్ జూనియర్ కోకో పోటీలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోసానిపేట్ విద్యార్థిని నేహా 9వ తరగతి. ఎంపికైందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 13 నుండి15వ తేదీ వరకు హైదరాబాదులో మౌలాలి హౌసింగ్ బోర్డ్ గ్రౌండ్లో రాష్ట్రస్థాయి పోటీలు జరగనున్నాయి. రాష్ట్రస్థాయి కి ఎంపికైన సిహెచ్ నేహా ని వ్యాయామ ఉపాధ్యాయుడు నరేష్ రెడ్డిని పాఠశాల బృందం విడిసి సభ్యులు అభినందించారు.