కరెంటు తీగలకు చెట్టేత్తు ప్రమాదం.
ట్రాన్స్ కో అధికారులు జర చూడండి.

బాన్సువాడ/కోటగిరి, జూలై 6 ( లోకంతీరు ) : బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండల కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద కరెంట్ తీగలపై చెట్టు కొమ్మలు ఏపుగా పెరిగి ప్రమాదాలకు నిలయంగా మారింది.ఏ సమయంలో ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని కాలనీ వాసులు భయం గుప్పెట్లో భయాందోళన చెందుతున్నారు.ప్రస్తుత వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకొని కోటగిరి ట్రాన్స్ కో అధికారులు తక్షణమే స్పందించి కరెంటు తీగలకు పొంచి ఉన్న చెట్టేత్తు ప్రమాదాన్ని నివారించాలని వినాయక్ నగర్ కాలనీవాసులు కోరుకుంటున్నారు.