కృంగిన రోడ్డును పరిశీలిస్తున్న మండల అధికారులు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి/ రాజంపేట ,సెప్టెంబర్ 01 ( లోకంతీరు ) : జిల్లాలోని రాజంపేట మండలం కొండాపూర్ గ్రామం నుండి మెదక్ వెళ్లే రహదారిలో నూతనంగా నిర్మించిన రోడ్డును రాజంపేట తహసిల్దార్, ఎంపిడిఓ, ఎంపీఓ ఆదివారం పరిశీలించారు. శనివారం రాత్రి నుండి ఆదివారం వరకు కురిసిన భారీ వర్షాలకు రోడ్డు కృంగినట్లు తెలిపారు. రోడ్డు వెంబడి ప్రయాణికులు దూరంగా వెళ్లేట్లు ముళ్లపొదలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, గ్రామాస్తులు పాల్గొన్నారు.