Take a fresh look at your lifestyle.

జిజిహెచ్ లో ఘనంగా నిర్వహించిన 75 వ గణతంత్ర దినోత్సవం వేడుకలు..

0 1,186

జిజిహెచ్ లో ఘనంగా నిర్వహించిన 75 వ గణతంత్ర దినోత్సవం వేడుకలు..

 

  • నింగికెగసిన స్వరాజ్య నినాదం..
  • భరతమాత చేతిలో..
  • రెపరెపలాడిన త్రివర్ణ పతాకం…
  • సకల భారతావని ఆనంద సంబరం జిజిహెచ్ లో

నిజామాబాద్ ,జనవరి 26 ( లోకం తీరు ) :   ముఖ్యఅతిథిగా విచ్చేసిన నిజామాబాద్ జిల్లా ప్రముఖ వైద్యులు , ప్రగతి ఆసుపత్రి  వ్యవస్థాపకులు డా. ఆల లక్ష్మరెడ్డి తో కలిసి డాక్టర్  ప్రతిమ రాజ్ సూపరింటెండెంట్ 75వ భారత గణతంత్ర దినోత్సవ పురస్కరించుకొని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిజామాబాదులో జాతీయ జెండాను ఆవిష్కరించి సామూహిక జాతీయ గీతాలాపనను నిర్వహించారు..

 డా. ఆల లక్ష్మరెడ్డి మాట్లాడుతూ అందరికి ణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, వైద్య వృత్తి సంఘ పరమైన మరియు సేవ పరమైనదని తెలిపారు. వైద్యులు ఎంతో ఓపికగా రోగులకు చికిత్స అందిచాలని, మానవతా దృక్పధం తో మెలగాలని తెలియజేశారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన సూపరింటెండెంట్ కి ధన్యవాదాలు తెలియజేశారు.
 ఈ సందర్భంగా డాక్టర్ ప్రతిమ రాజ్ మాట్లాడుతూ ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ లక్ష్మారెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
 ప్రపంచంలోనే మన భారత దేశ రాజ్యాంగ అతి పెద్దది అని తెలిపారు. మన ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశ సూత్రాలు పాటిస్తూ, మన ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాంగం నిర్దేశిస్తుoదని తెలిపారు.  ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా మన దేశంలో భిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు, భిన్న మతాలు ఉన్నా అందరూ దేశం కోసం ఐక్యమత్యంగా ఉంటారని , ఇకముందు ఉండాలని సూచించారు.
 నా దేశం “భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం” అని ప్రశంసించారు..అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన ఆ మహనీయుడు డాll బి ఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకోవాలని వారికి గౌరవ వందనం తెలిపారు.
మరియు డాక్టర్ లక్ష్మారెడ్డి   వైద్యులు మాత్రమే కాదు ఒక గొప్ప మానవతా వాది అని ఆయనను మనందరికీ ఆదర్శం అని ఆయన స్పూర్తి తో , ప్రజలకు సేవ చేయాలనీ, రోగులకు ఓపికతో చికిత్స అందిచాలని తెలిపారు.
మరియు డాక్టర్ లక్ష్మారెడ్డిని సన్మానించడం జరిగింది.ఆసుపత్రి లో పనిచేసే నర్సింగ్   సిబ్బంది అందరు ఆయనకు ప్రత్యెక ధన్యవాదాలుతెలిపారు.
   అలాగే ఆసుపత్రి అభివృద్ధి తన ఒక్కదానివలనే సాధ్యం కాదని కనిష్ట స్థాయి నుంచి గరిష్ట స్థాయి వరకు అందరి సమిష్టి కృషి ఇది అని ప్రతి ఒక్కరిని పేరుపేరునా అభినందించారు. సిబ్బంది అంతా ఐక్యమత్యంగా ఉంటేనే ఏ అభివృద్ధి అయినా ఏ విజయమైన సాధ్యమవుతుందని తెలియజేశారు.
 అలాగే  ఆరోగ్య శ్రీ & ఆయుష్మాన్ భారత్ పథకంలో  రాష్ట్ర స్థాయిలో మన ఆసుపత్రి కి అవార్డు రావడం ఎంతో గర్వంగా ఉందని దీని కొరకు కృషి  చేసిన వారందరికీ అభినందనలు తెలియజేశారు.
 ఆస్పత్రిలో వివిధ విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రములను అందజేయడం జరిగింది. అలాగే జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రశంస పత్రం అందుకున్న ఆసుపత్రి సిబ్బందిని అభినందించడం జరిగింది.
 ఈ కార్యక్రమంలో డా. బాలరాజ్, డా. కమ్రాన్, డా.సుజాత,   డాక్టర్ నాగేశ్వర రావు,  సంతోష్ కుమార్ అసిస్టెంట్ డైరెక్టర్,  రమాదేవి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అన్ని విభాగాల వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ,కార్యాలయ సిబ్బంది, మరియు ఇతర సిబ్బంది పాల్గొనడం జరిగింది…
అలాగే ఈరోజు నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా,  ప్రభుత్వ  జనరల్ ఆసుపత్రి,   నిజామాబాదు కి ఉత్తమ ఆరోగ్యశ్రీ & ఆయుష్మాన్ భారత్ సేవలను అందించినందుకు గాను జిల్లా కలెక్టర్ గారు అవార్డును డాక్టర్ ప్రతిమ రాజ్ సూపరింటెండెంట్ కి అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.