ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ గా నరేందర్

నాగిరెడ్డిపేట్, సెప్టెంబర్ 12(లోకంతీరు) : నాగిరెడ్డిపేట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ గా నరేందర్ ను నియమించినట్లు జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం ఓ ప్రకటనలో తెలిపారు. గతలో ఇక్కడ ఇంచార్జ్ ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహించిన హేమచందర్ మెదక్ జిల్లా కూల్చారం కు బదిలీ కాగా అతని స్థానంలో లింగంపేట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహిస్తున్న నరేందర్ ను ఇంచార్జ్ ప్రిన్సిపాల్ గా నియమించినట్లు వారు తెలిపారు.