Take a fresh look at your lifestyle.

ప్రజావాణికి 61 ఫిర్యాదులు….

0 1,202

ప్రజావాణికి 61 ఫిర్యాదులు

 

నిజామాబాద్, జనవరి 29 ( లోకం తీరు ) : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 61 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, యాదిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ మకరందు, జెడ్పి సీఈఓ గోవింద్, డీఆర్డీఓ చందర్, నిజామాబాద్ ఏ.సీ.పీ కిరణ్ కుమార్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.