స్నేహితుడి జ్ఞాపకార్ధంగా విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

కామారెడ్డి జిల్లా కామారెడ్డి, మార్చి14 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు వారి స్నేహితుడు మీసాల నితిన్ జ్ఞాపకార్ధంగా ప్రస్తుతం పరీక్షలు రాయపోతున్న పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లు, పెన్నులను అందజేశారు. విద్యార్థులు బాగా చదువుకొని పరీక్షలు రాయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగా కిషన్, ఉపాద్యాయులు సాయిలు, శ్రీశైలం, సహేందర్, పూర్వ విద్యార్థులు ఇమ్రాన్, రాకేష్, నవీన్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.