ఆర్గోoడ పిఏసిఎస్ డైరెక్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక
-
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో

రాజంపేట, ఎప్రిల్ 18 ( లోకంతీరు ) : ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో గురువారం రాజంపేట మండలం ఆర్గొండ పి ఏ సి ఎస్ డైరెక్టర్ తోట మధుకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి కష్టపడి జహిరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ శెట్కార్ ను గెలిపించుకుంటామాని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర ప్రణీత్ రెడ్డి, జనరల్ సెక్రటరీ అల్లకొండ సంతోష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.