ఆన్లైన్ మోసం నగదు బదిలీ

కామారెడ్డి ప్రతినిధి , ఆగస్టు 17 (లోకంతీరు) : మాచారెడ్డి మండల కేంద్రంలో చెందిన పోతారం గ్రామానికి చెందిన దువ్వల సాయిలు (47) తన పెద్ద కొడుకు దువ్వల సంతోష్ దుబాయ్ నుండి ఈనెల9 వ తేదీన 70 వేల రూపాయలు అకౌంట్ కి పంపగా ఈనెల 12 తారీకు అట్టి డబ్బులను తీసుకుందామని బ్యాంకుకు వెళ్లి అకౌంట్ చెక్ చేయగా డబ్బులు యూపీఐ ట్రాన్జక్షన్ ద్వారా వేరే వాళ్ళ అకౌంట్ లోకి వెళ్లినట్లు మేనేజర్ తెలుపగా, తాను ఎలాంటి ఓటీపీ, వేరే ఇతరత్రా లింక్స్ గాని ఓపెన్ చేయలేదని తాను మోసపోయానని గ్రహించి 70 వేల రూపాయలు పోయాయని స్థానిక పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినామని స్థానిక పోలీసులు తెలిపారు.