కాలభైరవ ఆలయాన్ని సందర్శించిన కలెక్టర్
– ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 21 (లోకంతీరు) : ఇసన్నపల్లి, రామారెడ్డి లోని శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ ఉద్యోగులు పూర్ణకుంభంతో కలెక్టర్ కు స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాముఖ్యతను వేద పండితులు వివరించారు. ఆలయ ఉద్యోగులు కలెక్టర్ కు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి ప్రభు, ఉద్యోగులు శ్రీనివాస శర్మ, రాములు పాల్గొన్నారు.