Take a fresh look at your lifestyle.

విజయోత్సవ ర్యాలీని విజయవంతం చేయండి : బేతెల్లి మధుకర్‌రెడ్డి.

0 6

విజయోత్సవ ర్యాలీని విజయవంతం చేయండి : బేతెల్లి మధుకర్‌రెడ్డి.
అంబేద్కర్‌ చౌరస్తా నుంచి హనుమాన్‌ టెంపుల్‌ వరకు ర్యాలీ.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్‌-భూపాలపల్లి, సెప్టెంబర్‌ 4: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాపాలన వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 5న భూపాలపల్లిలో నిర్వహించనున్న విజయోత్సవ ర్యాలీని విజయవంతం చేయాలని ఎస్సీ-ఎంఎల్‌యూ-ఐఎన్‌టీయూసీ భూపాలపల్లి ఏరియా బ్రాంచ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బేతెల్లి మధుకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం ఉదయం 10 గంటలకు స్థానిక అంబేద్కర్‌ చౌరస్తా నుంచి హనుమాన్‌ టెంపుల్‌ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని కోరారు. ర్యాలీతో పాటు సమావేశాలు, సభలు నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా డీసీసీ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్‌, భూపాలపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ బుర్ర కొమురయ్యగౌడ్‌, వైస్‌ చైర్మన్‌ అంబాల శ్రీనివాస్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దాట్ల శ్రీనివాస్‌ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ, మహిళా కాంగ్రెస్‌ నాయకులు, ఐఎన్‌టీయూసీ కేంద్ర, రాష్ట్ర, బ్రాంచ్‌ నాయకులు, ఎస్సీ-ఎంఎల్‌యూ-ఐఎన్‌టీయూసీ మైనింగ్‌ స్టాఫ్‌ ఇన్‌చార్జి, సీనియర్‌ ఐఎన్‌టీయూసీ నాయకులు, యూత్‌ వింగ్‌ నాయకులు, గనులు, వివిధ విభాగాల పిట్‌ కమిటీ నాయకులు, కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు, ఆయా విభాగాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మధుకర్‌రెడ్డి కోరారు.

Leave A Reply

Your email address will not be published.