టియంఆర్ఎస్ మైనారిటీ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ
కోటగిరి ఎంపీటీసీ కొట్టం మనోహర్
కోటగిరి , జనవరి 22, ( లోకం తీరు ) : కేంద్రంలోనీ టియంఆర్ఎస్ జూనియర్ కళాశాలను కోటగిరి ఎంపీటీసీ కొట్టం మనోహర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం రుచి శుచి తో కూడిన నాణ్యమైన భోజనం అందించాలని కోటగిరి ఎంపీటీసీ కొట్టం మనోహర్ ఆదేశించారు. విద్యార్థుల కోసం సిద్ధం చేస్తున్న వంటకాలను ప్రత్యక్షముగా పరశిలించి నాణ్యమైన రైస్ మరియు కూరగాయలతో తయారు చేసిన వంటకాలను విద్యార్థులకు వడ్డించాలని ఆదేశించారు. భోజనానికి సంబంధించిన మెనూ ను తప్పనిసరిగా పాటించాలని వసతి గృహం సిబ్బందిని ఆదేశించారు. పర్మినెంట్ బిల్డింగ్ నిర్మాణం కోసం టియంఆర్ఎస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మొహమ్మద్ ముబీన్ ను నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డెలిగేట్ ప్రధాన కార్యదర్శి కొట్టం మనోహర్ దృష్టికి తెచ్చారు. ఉన్నత విద్యాశాఖ అధికారులతో మాట్లాడి హామీ ఇవ్వడం జరిగింది
ఇట్టి కార్యక్రమంలో కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షాహిద్ భాయ్ అఫ్జల్ భాయ్ అబ్బయ్య గైని ఆనంద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు