Take a fresh look at your lifestyle.

ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ……

0 1,285

ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

  • కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి జిల్లా , జూలై 22 ( లోకంతీరు ) : కామారెడ్డి లో కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో 91 ఫిర్యాదులు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యా దులను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. వచ్చిన ఫిర్యాదులను శాఖల వారీగా పంపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డిఆర్ డిఓ చందర్, డిపిఓ శ్రీనివాసరావు, సిపిఓ రాజారాం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, కలెక్టరేట్ ఏవో మసూర్ అహ్మద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.