ఆషాఢమాసం పురస్కరించుకుని పూజలు

కామారెడ్డి జిల్లా , జూలై 30 ( లోకంతీరు ) : శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ శరణం స్వర్ణ యుగశ్రీ కల్కి దేవాలయంలో ఆషాడమాసం మంగళవారం పురస్కరించుకొని శ్రీ సర్వదేవ పరంకరణ పరంజ్యోతి భగవతి భగవాన్లకు శాకంబరీ రూపంలో అలంకరణ చేశారు. అనంతరం సుమారుగా 500 మంది భక్తులకు మహా అన్న ప్రసాదం వితరణ చేసారు. ఈ కార్యక్రమంలో భక్తులు, సేవకులు పాల్గొన్నారు.