ధర్మ యుద్ధ మహాసభకు హాజరైన మంద కృష్ణ మాదిగ

కామారెడ్డి జిల్లా , నవంబర్ 03 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మందకృష్ణ మాదిగ ధర్మ యుద్ధ మగసభకు ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాలలు ఎవరు చెప్తే వింటారు. రాష్ట్రపతి చెప్పిన, ప్రధానమంత్రి చెప్పిన, ఆఖరికి సుప్రీంకోర్టు చెప్పిన వినలేరు. మాలలు 59 ఉప కులాల ఆస్తి ఒకరే ఒకరికి కావాలంటే అది న్యాయమా… సమానత్వం 59 కులాలకు వాటా అందించాలని ఆనాటి అంబేద్కర్ కళా. ఆ కాలంలో నిజం చేయాలని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. త్వరలో ఏ నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయం కట్టుబడి ఉండాలని మాదిగలకు పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి తక్షణమే అమలు చేయకపోతే పెద్ద ఎత్తున దిగ్బంధాలు, ఉద్యమాలు, ఉంటాయని మందకృష్ణ మాదిగ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కామారెడ్డి ఇంచార్జీ మైలారం బాబు, ఎమ్మార్పీఎస్ మాజీ రాష్ట్ర కార్యదర్శి బట్ట వెంకట రాములు, సత్తిగారి లక్ష్మి, సామెల్, నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు ప్రమోద్, పోశెట్టి, పురుషోత్తం, బాలరాజు, పద్మారావు, లావణ్య, బట్ట రమేష్, కొంగల భూమేష్, రాజ నరసయ్య, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.