గణేష్ ఉత్సవాలు సాఫీగా జరుపుకోవాలి
– స్థానిక ఎస్సై నరేష్

రామారెడ్డి, సెప్టెంబర్ 03 (లోకంతీరు) :రామారెడ్డి మండల కేంద్రంలోని రైతు వేదిక లో మంగళవారం స్థానిక ఎస్సై నరేష్ పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు.శాంతి భద్రత విషయంలో గణేష్ ఉత్సవాలు సాఫీగా జరగడానికి యూత్ సభ్యులు పోలీసు వారికి సహకరించి ఎటువంటి శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఉత్సవాలు సాఫీగా జరుపుకోవాలని రామారెడ్డి ఎస్ఐ నరేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, ఎరిగేషన్, రామారెడ్డి గ్రామ పెద్దలు, ఆయా యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.