ధర్మ యుద్ధ మహాసభకు తరలిన ఎమ్మార్పీఎస్ నాయకులు

కామారెడ్డి జిల్లా , నవంబర్ 03 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈఎస్ఆర్ గార్డెన్ లో నిర్వహించినటువంటి ధర్మ యుద్ధ మహాసభకు నాగిరెడ్డిపేట మండలం నుండి ఎమ్మార్పీఎస్ నాయకులు కుంటోళ్ల యాదయ్య, తొంట సాయిలు ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్లారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ కార్యక్రమానికి మండలం నుండి భారీగా తరలి వెళ్లారు. ఎస్సీ వర్గీకరణ సాధించేవరకు పోరాటం ఆగేది లేదని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు తరలి వెళ్లారు.