వివాదాస్పద స్థలాలపై ఆర్డీవో ఆరా…..
బాల్కొండ రెవెన్యూ ఆఫీసులో రికార్డుల తనిఖీ…

బాల్కొండ నియోజకవర్గం , ఫిబ్రవరి 06 ( లోకం తీరు న్యూస్ ) : నిజామాబాద్ జిల్లా బాల్కొండ తాసిల్దార్ కార్యాలయాన్ని మరియు రికార్డులను తనిఖీ చేసిన ఆర్మూర్ ఆర్డీవో. గత కొంతకాలంగా వివాదాస్పద స్థలాలపై తహసీల్ కార్యాలయ రికార్డులను తనిఖి చేసారు. అలాగే పద్మ శాలి కులస్తులు సర్వే నంబరు 1181 బాల్కొండ శివారులో గల భూమికి సంబంధిన సమస్యను ఆర్డిఓ దృష్టికి తీసుకెళ్ళారు. మండలంలో గల ప్రభుత్వ భూములను కాపాడవలసింధిగా అధికారులను అదేశించినారు మరియు ప్రభుత్వ భూమి సర్వే నంబరు 1333 ను కొలిచి హద్దులు నిర్నహించడానికి జిల్లా కలెక్టర్, నిజామాబాద్ నుండి 4 సర్వేయర్లను డిప్యుట్ చేసినారని తెలిపినారు. బాల్కొండ తాసీల్దార్ మరియు రెవిన్యూ ఇన్స్పెక్టర్ సిబ్బంది ఉన్నారు.