భూంపల్లి గ్రామంలో…..మాల మహానాడు నూతన సంఘం ఏర్పాటు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 20 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని భూంపల్లి గ్రామంలో మాల మహానాడు నూతన సంఘం ఏర్పాటు చేయడం జరిగిందని అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ గ్రామంలో మాల మహానాడు సంఘం ఏర్పాటు చేయడానికి 100 మంది కమిటీతో మాల మహానాడు కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు అధ్యక్షుడిగా మొగ్గం రాజేందర్ ఉపాధ్యక్షుడిగా సుంకరి నర్సింలు ప్రధాన కార్యదర్శి సుంకరి రాజు కోశాదికారి గైని భాస్కర్ కార్యదర్శి మొగ్గం బాలరాజు సలహాదారుడు గౌరవ అధ్యక్షులు మాజీ ఎంపీపీ గైని నాగేశ్వర్ ను నియమించారు మాల మహానాడు కమిటీలో 94 మంది కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగిందని అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు ఈ కార్యక్రమంలో మహానాడు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.