తడి చెత్త సేకరణపై దృష్టి సారించాలి
- డిఎల్పిఓ సాయిబాబా.
బాన్సువాడ/కోటగిరి, ఫిబ్రవరి 20 ( లోకంతీరు ) : గ్రామాలలో తడి చెత్త సేకరణపై దృష్టి సారించాలని బోధన్ డిఎల్పిఓ సాయిబాబా గ్రామ పంచాయతీ సిబ్బందికి ఆదేశించారు.మంగళవారం పోతంగల్ మండలంలో మండల పరిధిలోని జిల్లాపల్లి,జల్లాపల్లి ఫారం గ్రామ పంచాయతీలను ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయా లలో ఆయన రికార్డులను తనిఖీ చేసి,గ్రామంలోని కంపోస్ట్ షేడ్లను పరిశీలించారు.ఆయన వెంట ఎంపీవో మారుతి, జిల్లాపల్లి జీ.పి కార్యదర్శి శ్రీవాణి,జల్లాపల్లి ఫారం జీ.పి కార్యదర్శి రాజేశ్వరి, తదితరులు ఉన్నారు.