పరుశుధ్య పనులను పరిశీలించిన ఎంపీవో

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, జులై 31(లోకంతీరు) : ముప్కాల్ మండలంలోని నల్లుర్ గ్రామంలో పారిశుద్ధ్య పనులను ఎంపీవో మహమ్మద్ గౌస్ బుధవారం రోజు ఉదయం ఆర్యవేక్షించారు. అందులో భాగంగా పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, వైకుంఠ ధ్వామమ్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. పంచాయితీ రిజిష్టర్ లను సైతం తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఆయన వెంట నల్లూర్ పంచాయతీ సెక్రటరీ విజ్ఞేష్, సిబ్బంది తదితరులు ఉన్నారు.