స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న మహిళా సభ్యులు

కామారెడ్డి జిల్లా, ఆగస్టు 08 ( లోకంతీరు ) : రాజంపేట మండల కేంద్రంలో స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా గ్రామ మహిళా సంఘం ఆధ్వర్యంలో సంఘ మహిళలు, సిబ్బంది పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం పిచ్చి మొక్కలను తొలగించారు. దీనివలన అంటు వ్యాధులు దోమలు జ్వరాలు రాకుండా ఉంటాయని సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం సాయిలు, సీసీ శ్రీనివాస, వి ఓ ఏ లు శ్యామల, భవాని, అన్నపూర్ణ లు పాల్గొన్నారు.