గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి
-
మోర్తాడ్ పోలీస్ వారి సూచన

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి ,ఆగస్టు 27 ( లోకంతీరు ) : మోర్తాడ్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై విక్రమ్ ఆద్వర్యంలో గణేశ్ ఉత్సవాల నిర్వహణా గురించి శాంతి కమిటీ నిర్వహించరు ఇట్టి శాంతి కమిటీ నందు మోర్తాడ్ మండలంలోని అన్నీ గణేశ్ మండపముల నిర్వహించు సబ్యులు మరియు గ్రామ పెద్దలు హాజరుకాగా వారిని ఉద్దేశించి ఎస్సై విక్రమ్ మాట్లాడుతూ కుల మత బేదాలు లేకుండా గణేశ్ ఉత్సవాలను ప్రశాంతముగా జరుపుకోవాలని సూచించారు.