ప్రత్యేక వైద్య శిబిరం

రామారెడ్డి, సెప్టెంబర్ 03 (లోకంతీరు) : రామారెడ్డి మండల కేంద్రంలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా నిరాశ్రయులైన బాధిత కుటుంబాలను పునరావాస కేంద్రాల కు పంపించడం జరిగింది. వారి ఆరోగ్య రీత్యా డాక్టర్ సురేష్ పునరావాస కేంద్రంలో ఉన్నటువంటి వారికి కావలసిన వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరం ఉన్నవారికి మందులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జార్జ్, ఆశ వర్కర్ లు, వైద్య సిబ్బంది, బాధిత కుటుంబాలు, తదితరులు పాల్గొన్నారు.