రాజకీయంగా ఆర్యవైశ్యులను బలోపేతం చేస్తాను
– అధ్యక్షులు పడిగల శ్రీనివాస్

రామారెడ్డి, సెప్టెంబర్ 22 ( లోకంతీరు ) : జిల్లా ఆర్యవైశ్య మహాసభ కామారెడ్డి నూతన కార్యవర్గంలో జిల్లా రాజకీయ విభాగం ఎగ్జిక్యూటివ్ అధ్యక్షులుగా పడిగాల శ్రీనివాసునుఎన్నుకున్నటువంటి జిల్లా అధ్యక్షులు కంచర్ల బాలకిషన్ గుప్తా కి, వారి పాలకవర్గానికి నా ఎన్నికకు సహకరించిన రామారెడ్డి మండల ఆర్యవైశ్య సోదరులకు జిల్లా ఆర్య వైశ్య సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజులలో ఆర్యవైశ్యులను రాజకీయ ఎదుగుదలకు కృషి చేస్తానని,రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఎక్కడైనా ఆర్యవైశ్యులు నిలబడితే వారి గెలుపుకు సహాయ సహకారాలు అందిస్తానని ఆర్యవైశ్యులను రాజకీయంగా చైతన్యపరచుటకు సమావేశాలు ఏర్పాటు చేస్తానని నా ఎన్నికకు సహకరించిన ఆర్యవైశ్యులందరికి పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు పడిగల శ్రీనివాస్ రామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య రాజకీయ విభాగం ఎక్స్క్యూటివ్ అధ్యక్షులు తెలిపారు.